బికినీ వేసుకుని బీచ్ కే అందాన్ని తెచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్..!

ఒకప్పుడు టాలీవుడ్ లో సత్తా చాటిన హీరోయిన్ సమీరారెడ్డి ప్రస్తుతం సరి కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నది. ఈమె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో రెండు మూడు సినిమాలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక చిరంజీవితో కూడా జై చిరంజీవ అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. కానీ ఈమెకు ఏ సినిమా కూడా కలిసి రాలేదా చెప్పుకోవచ్చు.

దాంతో ఇక ఈమె బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. అక్కడ కూడా కొద్దిరోజులు తన హవా కొనసాగించిన ఆ తర్వాత మధ్యలో కొన్ని స్పెషల్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను అలరించేది.తెలుగులో కూడా ఈమె దగ్గుబాటి రానాతో కలిసి కృష్ణం వందే జగద్గురం అనే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ తో దర్శనమిచ్చింది. ఇక ఆ తర్వాత ఈమె సినిమాలవైపు అడుగుపెట్టలేదు.

ఇక 2014 సంవత్సరంలో అక్షయ్ వార్దేను వివాహం చేసుకుంది సమీరారెడ్డి. వీరిద్దరి ఒక కొడుకు కూడా జన్మించారు. ఈమే సినిమా ఇండస్ట్రీకి దూరమైన దాదాపుగా 7 సంవత్సరాలు కావస్తోంది. అయినా కూడా ఈమె సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించి ఫోటోలను ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బికినీ ఫోటోలను కూడా షేర్ చేసింది ఆ ఫోటోలు కాస్తా వైరల్ గా మారుతున్నాయి.