కాకినాడ థియేట‌ర్‌లో `సీటీమార్` చూసిన బ‌న్నీ..ఫైర‌వుతున్న నెటిజ‌న్లు?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం కాకినాడ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న హీరోగా సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌` . ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కాకినాడలో జరుగుతుంది.

Allu Arjun shares COVID-19 health update, says he is recovering | The News Minute

ఇందులో భాగంగానే అల్లు అర్జున్‌ శనివారం కాకినాడ చేరుకున్నారు. కాకినాడ పోర్టు ఏరియాలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే శనివారం ఆ ఏరియాలో భారీగా వర్షం పడడంతో సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. దాంతో ఖాళీ స‌మ‌యం దొర‌క‌డంతో బ‌న్నీ కాకినాడలోని ‘పద్మప్రియ’ థియేటర్‌కు వెళ్లి అక్క‌డ గోపీచంద్ హీరోగా తెర‌కెక్కిన‌ ‘సీటీమార్’ సినిమాను వీక్షించారు.

Tollywood actor Sai Dharam Tej injured in road accident, condition stable | Celebrities News – India TV

ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు కార‌ణం సాయి ధ‌ర‌మ్ తేజ్ బైక్ ప్ర‌మాద‌మే. అవును, తేజ్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో ఉండగా.. సినీ తార‌లే కాకుండా రాజ‌కీయ నాయ‌కులు సైతం సోష‌ల్ మీడియా వేధిక‌గా స్పందించారు. ఆయన త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాక్షించారు. అయితే ఈ విష‌యంపై బ‌న్నీ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. షూటింగ్‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల బ‌న్నీ స్పందించ‌లేక‌పోయాడేమో అని అనుకున్నారు. కానీ, సీటీమార్ సినిమా థియేటర్‌లో బ‌న్నీ ప్రత్యక్షం అవ్వడంతో నెట్టింట ర‌చ్చ మొద‌లైంది. బ‌న్నీ తీరుపై నెటిజ‌న్లు ఫైర‌వుతూ ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి బ‌న్నీ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.