`ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి.. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన రెండో చిత్రం `మహాసముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ అజయ్ భూపతికి ఓ స్టార్ హీరో నుండి కథ చెప్పమంటూ పిలుపొచ్చిందట. ఇంతకీ ఈ హీరో ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ ధనుష్. అనువాద చిత్రాలతో టాలీవుడ్లో తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ధనుష్.. అజయ్ భూపతితో సినిమా చేయాలని ఇంట్రస్ట్ చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, రీసెంట్గా గోవాలో అజయ్ భూపతిని కలిసి ధనుష్ ఓ మంచి కథ చెప్పమని కోరాడని, ప్రస్తుతం అజయ్ భూపతి అదే పనిలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇదే నిజమైతే త్వరలోనే ధనుష్-అజయ్ భూపతి కాంబోలో తెరకెక్కబోయే ప్రాజెక్ట్పై ప్రకటన వస్తుంది.