రాధేశ్యామ్ సినిమాలో అలాంటి పాత్రలో నటిస్తున్నాను.. భాగ్యశ్రీ లీక్?

నటి భాగ్యశ్రీ మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ఏకంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత తన వ్యక్తిగత జీవితం పై దృష్టి పెట్టడానికి సినీ పరిశ్రమను విడిచిపెట్టింది. ఇక ఆ తరువాత మూడు దశాబ్దాల తర్వాత తిరిగి మళ్లీ నటిగా ప్రస్తావనే ప్రారంభించింది ఈమె. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలోని ఆమె పాత్ర గురించి ఒక ఇంటర్వ్యూ ద్వారా లీక్ చేసింది భాగ్యశ్రీ.

రాధేశ్యామ్ సినిమాలో నాది తల్లి పాత్ర కాదు, కథలో ఎంతో కీలకమైనది, అలాగే నా పాత్రని తీసేస్తే స్టోరీ మొత్తం ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పుకొచ్చింది. ఇకపై ఇలాంటి పాత్రలే చేస్తాను, ఎడిటింగ్ లో పోయే రోజు చేయడం వలన ఉపయోగం ఉండదు అని తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమా నా పాత్రతోనే మొదలయ్యే చివరి వరకు సాగుతుందని తెలిపింది. ఈ సినిమా చాలా సన్నివేశాలు విదేశాల్లో చేశారని, అయితే అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి గ్రాండ్ గా హైదరాబాద్ లో వేసిన సెట్స్ అద్భుతంగా ఉన్నాయని భాగ్యశ్రీ చెప్పింది. అందుకే ఈ సినిమాను బుల్లితెర మీద కంటే వెండితెర మీద చూస్తే ఆ ఫీల్ బాగుంటుందని చిత్రబృందం థియేటర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు అని తెలిపింది.