సక్సెస్ కు మారు పేరుగా ఇమేజ్ ను సొంతం చేసుకున్న నేటి తరం హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నాడు. అంచెలంచెలుగా ఎదిగి పెద్ద సక్సెస్లను తన సొంతం చేసుకున్నాడు. రాజకీయాల్లోకి వెళ్ళక ముందు నిదానంగా సినిమాలు తీస్తూ వచ్చాడు. రాజకీయాల నుంచి ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తరువాత ఎప్పుడూ లేనంత వూప్ అందుకున్నాడు. ఈ మధ్యకాలంలో వకీల్ సాబ్ సినిమాతో సందడి చేసిన ఈ హీరో మళ్లీ భీమ్లా నాయక్ సినిమాతో దూసుకెళ్తున్నాడు. అంతేకాకుండా హర హర వీరమల్లు వంటి చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఎందుకంటే తనకు సంబంధించిన సినిమాలను ఎంతో త్వరగా పూర్తి చేయటానికి కష్టపడతాడు.అందులో ఒకటి హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్తో చేయబోతున్న సినిమా ఒకటి, కాగా.. మరో చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి దర్శకత్వంలో చేయాల్సి ఉంది.
త్వరలోనే ఈ రెండు సినిమాలను కూడా పవన్ ట్రాక్ లొకి ఎక్కించే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ప్రభాస్ తర్వాత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో పవనే. వకీల్ సాబ్ సినిమా సమయంలో చాలా తక్కువ డేట్స్ మాత్రమే కేటాయించిన పవన్, ఏకంగా యాబై కోట్ల రూపాయలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడట. అలాగే హరిహర వీరమల్లు విషయంలోనూ అంతేనట. అయితే త్వరలోనే చేయబోయే హరీశ్ శంకర్ సినిమా విషయంలో కాస్త భిన్నంగా ఎక్కువ డేట్స్ అవసరం పడటంతో నిర్మాతలు ఏకంగా పదికోట్ల రూపాయల రెమ్యునరేషన్ను పెంచి .. అంటే అరవై కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా ఇస్తున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
గబ్బర్ సింగ్ తర్వాత పవన్కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గానే హరీశ్ శంకర్, మైత్రీ మేకర్స్ నిర్మాతలు పవన్ను కలిసి సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరిపారు.