ఆ రాష్ట్రంలో పోసాని పై కేస్ ఫైల్..!

సినీ నటుడు పోసాని పై తక్షణమే కేసు నమోదు చేయాలని మరొకసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు , జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెప్టెంబర్ 28 న పోసాని.. కృష్ణ మురళి పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగినట్లు..జనసేన పార్టీ కార్యకర్తలు తెలియజేశారు. చిరంజీవి ఈ విషయంపై స్పందించే వరకు పోలీసులు ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదని తెలియజేస్తున్నారు.

అందువలన పంజాగుట్ట పిఎస్ కు మళ్లీ ఈరోజు వెళ్లి వచ్చారు అన్నట్టుగా తెలియజేస్తున్నారు. పోసాని పై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు జనసేన కార్యకర్తలు, అభిమానులు. సభ్య సమాజం తలదించుకునేలా పోసాని మహిళలను బూతులు మాట్లాడారు అన్నారు.. అంతేకాకుండా యావత్ మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలి అన్నట్లుగా డిమాండ్ చేస్తున్నారు.

ఇక పోసాని ఇంటిపై దాడి అదంతా నాటకమని అంటున్నారు జనసేన కార్యకర్తలు, అభిమానులు
. పోసాని వైఖరి మార్చుకోవాలి ..బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా మహిళల ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు.