హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశాల్..నిన్న (ఆదివారం) తన 44వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా విశాల్ తన గొప్ప మనసు చాటుకున్నాడు.
తన బర్త్డే నాడు అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించాడు.పేద మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, నీటి బిందెలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు అన్నదానంతో పాటు చీరలు, పంచెలు కూడా పంచి పెట్టారు.
అలాగే స్థానిక కెల్లీస్లోని సురభి ఆశ్రమంలో అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి తన బర్త్డే వేడుకలను జరుపుకున్నారు. అంతేకాదు, అక్కడున్న అనాథ పిల్లలకు తన చేతితో స్వయంగా అన్నం తినిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారగా.. విశాల్ గొప్ప మనసుకు ఫిదా అయిన నెటిజన్లు మరియు అభిమానులు ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు.