కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి `మైఖేల్` అనే టైటిల్ను ఖరారు చేశారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. సూపర్ ఇంట్రస్టింగ్గా ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్కు మంచి కిక్ ఇచ్చింది. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్.పి, ఏషియన్ సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సింహాసనం కోసం పోటీ పడే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాని రూపొందించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలోనే కాకుండా..హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.