వరుసకు మహేష్బాబు, సుధీర్ బాబు బావబామ్మర్దులు అవుతారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బామ్మర్ది కోసం మహేష్ బాబు రంగంలోకి దిగబోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటించింది.
గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ చిత్రమిది. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 27వ తేదీన థియేటర్లకు రానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు చేత శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ను విడుదల చేయించబోతున్నారు మేకర్స్.
రేపు ఆగష్టు 19న ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ని మహేష్ ఉదయం 10 గంటలకి రిలీజ్ చెయబోతున్నట్టు తాజాగా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఇక మహేష్ ట్రైలర్ను విడుదల చేస్తే.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవ్వడం ఖాయమని అంటున్నారు.