బామ్మ‌ర్ది కోసం బ‌రిలోకి దిగుతున్న‌ మ‌హేష్ బాబు..!!

వరుసకు మహేష్‌బాబు, సుధీర్ బాబు బావబామ్మర్దులు అవుతార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు బామ్మ‌ర్ది కోసం మ‌హేష్ బాబు రంగంలోకి దిగ‌బోతున్నారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. సుధీర్ బాబు హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. కరుణ కుమార్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా న‌టించింది.

Image

గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ చిత్ర‌మిది. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా ఆగ‌ష్టు 27వ తేదీన థియేటర్లకు రానుంది. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్లు నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ బాబు చేత శ్రీదేవి సోడా సెంటర్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయించ‌బోతున్నారు మేక‌ర్స్‌.

Sudheer Babu on Twitter: "Me and @Satyamrajesh2 had to paste a poster in  theatre to save the publicity cost?? ? Naaa ... we had to do that because  THIS IS A SUPERSPECIAL

రేపు ఆగష్టు 19న ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ని మహేష్ ఉదయం 10 గంటలకి రిలీజ్ చెయ‌బోతున్న‌ట్టు తాజాగా చిత్ర యూనిట్‌ కన్ఫర్మ్ చేసింది. ఇక మ‌హేష్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తే.. సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ అవ్వ‌డం ఖాయమ‌ని అంటున్నారు.