ప్లీజ్ ఇలాంటివి ఇంకొకసారి చేయకండి అని వేడుకుంటున్న రష్మిక మందన్న..?

మహేష్ బాబుతో సరిలేరి నీకెవ్వరూ సినిమా తీసిన ఈ ముద్దుగుమ్మ , ఈమధ్య రీసెంట్ గా అల్లు అర్జున్ తో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో మన ముందుకు రాబోతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు లీకుల బెడద తప్పేటట్లు లేదు. దీంతో గ్రాండ్ గా రిలీజ్ చేద్దామనుకున్న ఈ పాటకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ పాట ముందుగానే లీక్ అవడంతో సినిమా రంగంలో కలకలం రేపుతోంది. అల్లు అర్జున్ సినిమా కి లీకుల బెడద తప్పేటట్లు లేదు. రీసెంట్ గా పుష్ప సినిమా లోంచి కొన్ని సీన్ ఫైట్ కూడా బయటకు వచ్చింది.

దేవి శ్రీ ప్రసాద్ పాడిన శ్రీవల్లి అంటూ ఈ పాటకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. ఈ సాంగ్ ను రికార్డ్ చేసినప్పుడు ఈ సీను తీసినట్లు కనిపిస్తోంది. ఈ లీకులు కావటం వల్ల మైత్రీ మూవీ మేకర్స్ సీరియస్ అయ్యింది.

ఈ సినిమా లీకుల బెడద తట్టుకోలేక నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు. ఇలా లీక్ చేసే వారిని వదిలిపెట్టేది లేదంటూ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.

మీరు చేసే పని వల్ల అభిమానులు ఉత్సాహాన్ని, సంతోషాన్ని కోల్పోతున్నారు. సినిమా వచ్చే టైం లోనే వస్తే బాగుంటుందని ,ఇలా లీకులు చేస్తే చేసినవారికి తగిన ఫలితం ఉంటుందని హెచ్చరించారు.

అయితే ,నిర్మాతలు హెచ్చరించిన వీడియోను రష్మిక షేర్ చేశారు. ఇలాంటి వీడియోలను ఎంకరేజ్ చేయకూడదని రష్మిక చెప్పారు. ఇలా ఇంకొకసారి చేయకండి అని రష్మిక వేడుకున్నారు. ఇక ఇలాంటి లీక్ లపై బన్నీ సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడు. ఇకపై ఎవరూ కూడా సెట్లో ఫోన్లని వాడకూడదని చెప్పారు. పుష్ప సినిమా అభిమానులకు ఇది ఒక తీపి కబురు గా ఉంటుంది