ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక.. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు కథల ఎంపికలో కూడా ఆచి తూచి అడుగులు వేస్తూ వరుస హిట్ను ఖాతాలో వేసుకుంది. దాంతో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్లో చేరిపోయింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ.. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించబోతోన్న సంగతి తెలిసిందే. హిందీలో ఈమె తొలి చిత్రం `మిషన్ మజ్ను`. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శాంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. అప్పుడే రష్మిక తన షూటింగ్ పార్ట్ను పూర్తి కానిచ్చేసింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన రష్మిక.. షూటింగ్ అనుభవాలను తన అభిమానులు, ఫాలోవర్లతో షేర్ చేసుకుంది. `మిషన్ మజ్ను సినిమా షూటింగ్ను పూర్తి చేశాను. చిత్రీకరణ చాలా సరదగా గడిచింది. శాంతను బాగ్చిగారు కథ చెప్పినప్పుడే ఇలాంటి మంచి చిత్రంలో భాగం కావాలనుకున్నాను. హిందీలో నేను నటిస్తున్న తొలి సినిమాలో నా షూటింగ్ పార్ట్ అప్పుడే పూర్తయిందనే విషయాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను` అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.