కృష్ణాష్టమి సందర్భంగా ఫోటో విడుదల చేసిన ప్రభాస్..?

టాలీవుడ్ లో ప్రభాస్ ఎంతో మంది అభిమానులు సంపాదించాడు మనందరికీ తెలిసిన విషయమే.ఇక ఈయన బాహుబలి సినిమా తో పాన్ స్టార్ గా మారిపోయాడు.ఇక అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వరుస పెట్టి పాన్ సినిమాలలో చేస్తూ ఉన్నాడు ప్రభాస్. అయితే ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా ఒక ఫోటో ని విడుదల చేయడం జరిగింది ఆ ఫోటో కాస్త వైరల్ గా మారుతుంది.

ప్రభాస్ ప్రస్తుతం పూజా హెగ్డే తో రాధేశ్యాం సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు వీరిద్దరి కి సంబంధించి ఒక ఫోటో ను ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్ట్ చేయడం ద్వారా ఆ పోస్టు చాలా వైరల్ గా మారుతోంది. ఇక ఈ పోస్ట్ ను చూసుకుంటే వీరిద్దరు కలిసి ఒక మ్యూజిక్ను ట్యూన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ని ఐదు భాషల్లో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో చూసిన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

మరికొంతమంది అభిమానులు ప్రభాస్ పెళ్లి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నావ్ అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.ఈ సంవత్సరమైనా ఈయన తన అభిమానుల కోసం వివాహం చేసుకుంటారేమో వేచి చూడాల్సిందే.