రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సలార్`. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె హైదరాబాద్ ఈ చిత్రం మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది.
అయితే షూటింగ్లో పాల్గొన్న శ్రుతి హాసన్కు ప్రభాస్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ మధ్య సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్ ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్.. ఈసారి శ్రుతిహాసన్ కోసం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీ సహా దాదాపు ఇరవై రకాల వంటకాలను వండించి తీసుకొచ్చాడట.
ఇక ప్రభాస్ సర్ప్రైజ్కు ఫిదా అయిన శ్రుతి.. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ వంటకాల ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం శ్రుతి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.