మెగా ఫ్యామిలీ గొప్పతనాన్ని తెలిపిన రంగస్థలం మహేష్.. !

సినీ ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య గారి నటన ఎంత గొప్పగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించి, ప్రేక్షకులను బాగా నవ్వించే వారు. ఇక అల్లు రామలింగయ్య గారి మనవడే మన రామ్ చరణ్. ఇక ఈయన కూడా తన నటనతో ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంటున్నాడు.

అల్లు రామలింగయ్య గారికి తన మనవడు అంటే చాలా ఇష్టమట. ఇక అంతే కాకుండా సమయం దొరికినప్పుడల్లా అతని దగ్గర ఆడుకునేవారు. ప్రతిరోజు నిద్రపుచ్చే ముందు వారికి కొన్ని కథలను, మంచి మాటలను చెప్పేవారట అల్లు రామలింగయ్య గారు. ఆ మాటలు ఇప్పటి వరకు రామ్ చరణ్ పాటిస్తూ ఉండటం విశేషం.

ఈ విషయాన్ని తెలియజేసింది ఎవరో కాదు మన రంగస్థలం ఫేమ్ మహేష్ అచంట. రంగస్థలం మూవీ సినిమాలో నటిస్తున్నప్పుడు చరణ్ ఎక్కువగా సైలెంట్ గా ఉండేవారట. మిగతా వారంతా సెట్లో సందడిగా ఉంటే ఆయన మాత్రం తక్కువ మాట్లాడేవాడు. ఈ విషయంపై ఒకసారి మహేష్ రామ్ చరణ్ ని అడగగా.. తన తాతగారు చెప్పిన ఒక మాట ఆయన చెప్పుకొచ్చాడు.

ఆ మాట ఏమిటంటే “పెదవి దాటిన మాటకు నువ్వు బానిస అయితే పెదవి దాటని మాటకు నువ్వు రాజు” అని తెలియజేశారు రామ్ చరణ్. అందుచేతనే రామ్ చరణ్ ఎక్కువగా సెట్ లలో సైతం సైలెంట్ గా ఉంటాడు అని తెలిపాడు మహేష్. తన తాత గారి మీద ఎంత ఇష్టం వుందో తెలుస్తున్నది మనకి ఈ విషయాన్ని చూస్తే.. ఈ విషయాలన్నీ మహేష్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.