చందమామ ముగించేసిన షూటింగ్..

అందాల భామ కాజల్ అగర్వాల్..ఇటీవల కొత్త సినిమాలో నటిస్తోంది. పెళ్లి తర్వాత బిజీబిజీగా సినిమాలలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. ఇక ఈమె పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇక పోతే ఇటీవల చాలామంది హీరోలు హీరోయిన్లు కరోనా భయానికి సినిమాలు తీయటానికి భయపడుతున్నారు. కానీ కాజల్ కు కరోనా టైం లో ఛాన్సులు బీభత్సంగా వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో కాజల్ “ఉమా “అనే సినిమాను ఒకేసారి షూటింగ్ ను ముగించేసింది.

ఈ సినిమా చాలా స్పీడుగా పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని స్వయానా చిత్రం యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ సినిమాతో నూతన దర్శకుడిగా తథాగత సింఘా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు నిర్మాత గా అవికేష్ ఘోష్ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ముగిసినట్లుగా చిత్రం యూనిట్ సభ్యులు అధికారులు చెప్పారట. ఈ సినిమాలో నటించిన నటీ నటులతో కలిసి ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా సేవ్ చేశారు..

ఈ వీడియోపై కాజల్ తన పాత్ర పై చాలా సంతృప్తిని వ్యక్తం చేసింది. తాను ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాను అని వెల్లడించింది. ఇకపోతే తెలుగులో కాజల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసింది. ఆ సినిమాలలో అందం తోపాటు నటన కూడా చాలా బాగా చూపించింది. ఇక ఇప్పుడు హీరో చిరంజీవితో ఆచార్య సినిమాలో అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాల్లో కూడా నటించబోతోంది.ఇక ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయని , ఇక త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే నాగార్జున తో కూడా మరో సినిమాలో నటించడానికి సిద్ధమవుతోంది.