అప్పట్లో భూమికకు.. ఇప్పుడు పూజా కి దక్కిన సేమ్ అవకాశం ఏమిటో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఖుషి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో భూమిక ను చూసి ఎంతో మంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి అతియోశక్తి లేదు. అయితే భూమిక చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. ఈమె ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాలు మంచి విజయం సాధించి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

అయితే ఒకప్పుడు భూమిక అందుకున్న రికార్డును ప్రస్తుతం పూజా హెగ్డే అందుకోబోతోంది అని తెలుస్తోంది. ఒక లైలా కోసం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది. ప్రస్తుతం ఈమె ఒరిస్సా సినిమాలతో బిజీబిజీగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ 28వ సినిమాలో, మహేష్ బాబు 28 వ సినిమాలో పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకోవాలి అని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే గనుక నిజం అయ్యి ఆ సినిమాలు సూపర్ హిట్ అయితే పూజా ఖాతాలో సరికొత్త రికార్డు నమోదు అవ్వడం ఖాయం అనిపిస్తోంది. ప్రస్తుతం పూజ తెలుగులో ఆచార్య, రాధేశ్యామ్, తమిళంలో బీస్ట్, హిందీలో సర్కస్, భాయి జాన్ సినిమాలలో నటిస్తోంది.