మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు, నిహారిక భార్త జొన్నలగడ్డ వెంకట చైతన్యపై పోలీసు కేసు నమోదు అయింది. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత అర్ధరాత్రి ఏమైందో ఏమో కానీ నిహారిక అపార్ట్మెంటులో రచ్చ రచ్చ అయిందట.
అపార్ట్ మెంట్ వాసులకు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిందట. దీంతో అపార్టుమెంటు వాసులంతా చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో న్యూసెన్స్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారట.
అయితే నిహారిక భర్త సైతం అపార్ట్మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇక ఇరువురి తరపున ఫిర్యాదులు అందుకున్న పోసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియను న్నాయి. కాగా, నిహారిక గత ఏడాది చైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వివాహం రాజస్థాన్లో ఉదయ్ పూర్ ప్యాలెస్లో మెగా ఫ్యామిలీ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.