నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఘాటు వార్నింగ్.. ఏం జరిగిందంటే?

పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియమ్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే సినిమా టైటిల్ ఖరారు చేశారు. ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఒక నిర్మాతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అంటూ సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు నిర్మాత ఏ ఎన్ రత్నం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మి 150 కోట్లు బడ్జెట్ పెట్టాను కాస్త కనికరించండి అంటూ ఒక మెసేజ్ చేశారట. దీనితో ఏదైనా ఉంటే ఫోన్ చేసి లేదో పర్సనల్ గా కలిసి మాట్లాడితే బాగుంటుంది కానీ ఇలా మెసేజ్ పెట్టడం ఏమిటి అంటూ తన పిఎ చేత సదరు నిర్మాతకు ఫోన్ చేయించి ఏ ఎం రత్నం కు ఫుల్ గా క్లాస్ పీకాడట. ఈ ఈ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్ మీరు నన్ను నమ్మి 150 కోట్లు పెట్టడం లేదు కథను నమ్మి ఈ డబ్బు పెడుతున్నారు. నన్ను నమ్మి కాదు అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడట. అంతేకాకుండా నా కోసమే అని డబ్బులు ఖర్చు పెడుతున్నాను అని చెప్పుకోవడం ఫస్ట్ మానేయండి అంటూ ఫైర్ అయ్యాడట.