ఎన్టీఆర్‌తో నాగార్జున బిగ్ ఫైట్‌..దెబ్బ పడేది ఎవ‌రికో..??

బుల్లితెర వేదిక‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కింగ్ నాగార్జున‌ల మ‌ధ్య‌ బిగ్ ఫైట్ జ‌ర‌గ‌బోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` ఈ మ‌ధ్యే జెమినీ టీవీ స్టార్ట్ అయింది. తొలి ఎపిసోడ్ కు రామ్ చరణ్ పాల్గొని బాగా సందడి చేశాడు. ప్ర‌స్తుతం ఈ షో మంచి టీఆర్పీతో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతోంది.

Jr NTR to host latest season of Telugu game show 'Evaru Meelo Koteeswarulu' | The News Minute

అయితే ఇప్పుడు ఈ షోకు పోటీగా బిగ్‌బాస్ సీజ‌న్ 5తో నాగార్జున దిగ‌బోతున్నాడు. సెప్టెంబర్ 5న నుండీ బిగ్‌బాస్ స్టార్ట్ కాబోతుండ‌గా.. ఇప్ప‌టికే సెలెక్ట్ చేసిన కంటెస్టంట్ ల‌ను క్వారెంటిన్ లోకి పంపారు నిర్వాహ‌కులు. ఇక ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌తో పాటు బిగ్‌బాస్ షో అర గంట గ్యాప్‌లో దాదాపు ఒకే సమయంలో ప్రసారం కానున్నాయి.

Image

దాంతో టీఆర్పీ విషయంలో ఆయా ప్రోగ్రామ్స్ నిర్వాహకులకు పెద్ద దెబ్బ పడే అవకాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇక హోస్టింగ్‌లో ఇటు నాగార్జున‌, అటు ఎన్టీఆర్ ఇద్ద‌రూ ఇద్దరే. అలాగే ఈ రెండు షోల‌కూ మంచి క్రేజ్ ఉంది. అందు వ‌ల్ల, ఎవ‌రు ఎక్కువ ఎఫెక్ట్ అవుతార‌న్నది మాత్రం ఇప్పుడు చెప్ప‌డం చాలా క‌ష్టం. మ‌రి ఎన్టీఆర్ షో వల్ల నాగ్ హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్‌కు దెబ్బ ప‌డుతుందా? లేక‌ నాగ్ షో వల్ల ఎన్టీఆర్ షో చ‌తికిల ప‌డుతుందా..? అన్న‌ది త్వ‌ర‌లోనే తేలిపోనుంది.