ప్రస్తుతం టాలీవుడ్ లో” శ్రీదేవి సోడా సెంటర్”సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా ని డైరెక్టర్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పలాస చిత్రం తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ సినిమాని నిర్మించడం జరిగింది.ఇక ఈ రెండు చిత్రాలు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం డైరెక్టర్ కరుణ కుమార్ తన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒక కథ ఉన్నదంటూ చెప్పుకొస్తున్నాడు. శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఈ మాటలు ఆయన తెలియజేయడం జరిగింది.పవన్ కళ్యాణ్ కోసం తన దగ్గర ఒక కథ ఉంది ఆ కథ చేస్తే పవన్ కళ్యాణ్ వీరలెవల్లో ఉంటుంది అని చాలా ఎగ్జైటింగ్ గా చెప్పుకొచ్చారు.
ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేయని సబ్జెక్టు తన దగ్గర ఉందని పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే ఈ సినిమాతో ఆయన ఎక్కడికో వెళ్ళి పోతాడు అని తెలియజేశారు.ఇక అంతే కాకుండా ఒక టాలీవుడ్లోనే కాకుండా భారతదేశంమంతటా చూసే కథ ఇది అని కాన్ఫిడెంట్ గా తెలియజేశారు.
స్క్రీన్ మీద రజనీకాంత్,పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు ఎంత హంగామా ఉంటుందో మనందరికీ తెలిసిందే.ఎందుకు అంతలా క్రేజీ ఉంటుందంటే అది ఎవరు చెప్పలేమని తెలియజేశారు.అయితే మొత్తానికి మాత్రం పవన్ కళ్యాణ్ కోసం ఒక కథని రెడీ చేశారని మనకి అర్థం అయింది.అయితే త్వరలో పవన్ కళ్యాణ్ కరుణ కుమార్ తో కూడా ఈ సినిమా చేస్తారో వేచి చూడాల్సిందే.