మోహన్ బాబు కంచంలో మలం.. మోహన్ బాబు కు ఘోర అవమానం..?

సినీ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలంటే మొదటి ఎంతో కష్టపడితే కాని, హీరోగా రాణించలేము. ప్రతి హీరో వెనుక ఏదో ఒక కష్టం ఉండనే ఉంటుంది. కష్టపడుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ , సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వ్యక్తులలో మోహన్ బాబు కూడా ఒకరు. అయితే ఈయన పడిన అవమానాలు, కష్టాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

మోహన్ బాబు హీరోగా ఎదుగుతున్న సమయంలో ఒక చేదు ఘటన గురించి తెలియజేశాడు ఆలీ. కమెడియన్ ఆలీ తాజాగా ఈ విషయం గురించి చెప్పుకొచ్చారు . ఎంతో మంది ఆర్టిస్టుల గొప్పతనం చెబుతూ, ఈ విషయాన్ని తెలియజేశాడు ఆలీ. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబుకు ఇలాంటి అవమానం జరగడం చాలా బాధాకరమని తెలియజేశాడు.

ఆలీ బుల్లితెరపై, వెండితెర పై కూడా సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరివి. ఆలీ ప్రస్తుతం డ్రామా జూనియర్స్ అనే ప్రోగ్రాం లో జడ్జి గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా ఈ షో కి సంబంధించి ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో, మోహన్ బాబు గురించి ఒక విషయం తెలియజేయడం ద్వారా వీడియో కాస్త వైరల్ గా మారింది.

ఈ షో కి ముఖ్య అతిథిగా మంచులక్ష్మి హాజరు కావడం గమనార్హం అంతేకాకుండా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా , ఈ షో ని ప్రసారం చేయబోతున్నారు. ఇక ఈ షో లో మాట్లాడిన ప్రతి మాటల గుండెలకు గుచ్చుకునే విధంగా ఉన్నవి. కరోనా కాలంలో పడిన బాధలను చెబుతూ కంటతడి పెట్టించారు కొంతమంది ఆర్టిస్టులు. అంతేకాకుండా గవర్నమెంట్ ఇచ్చే బియ్యం కోసం ఎంతగానో వెయిట్ చేశామని తెలియజేశారు ఆర్టిస్టులు.

ఇక తను ఎంతో పెద్ద చదువులు చదువుకున్న కూడా, తమకు ఎటువంటి సదుపాయం కల్పించలేదని కంటతడి పెట్టుకున్నారు. ఇక ఆలీ, మోహన్ బాబు గురించి చెబుతూ ఒకానొక సమయంలో మోహన్ బాబు ఇంటి అద్దె కట్టలేదని, వాళ్ల ఓనర్ తను తినే కంచం లో మలవిసర్జన చేసినట్లు తెలిపాడు. ఈ మాట వినగానే ఒక్కసారిగా ఆ షో లో ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు.https://youtu.be/FsHvUjHLCPo