పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి పరిచయాలు అవసరం లేదు. తన మధురమైన గొంతుతో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకుల మదిని గెలుచుకున్న సునీత.. ఈ మధ్యే మ్యాంగో అధినేత, వ్యాపారవేత్త అయిన రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సునీత.. కెరీర్ను కూడా సక్సెస్ ఫుల్గా రన్ చేస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉండే సునీత.. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, వృతిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా తన ఎనర్జీకి కారణం ఏంటో అందరికీ తెలియజేసిందీమె.
తాజాగా ఇన్స్టాగ్రామ్లో పాడుతున్న ఫొటోను షేర్ చేసి సునీత..`పాట పాడటమే నా ఎనర్జీ` అంటూ ఓపెన్గా చేప్పేసింది. దాంతో ఈమె పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా, రెండో వివాహం తర్వాత సునీతకు సంబంధించి చిన్న విషయం బయటకు వచ్చినా.. అది తెగ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.