మహేష్ బాబు తన సోదరితో ఒక సినిమా చేయబోతున్నాడా..?

కృష్ణ తనయుడు మహేష్ బాబు తన కెరియర్లో ఎన్నో పెద్ద సినిమాలలో హిట్ కొట్టాడు. ఇప్పుడు కూడా వరుస హిట్ లతో మహేష్ మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. అంతకుముందు సక్సెస్ కోసం వెయిట్ చేసిన మహేష్ అయితే కొంత కాలం తర్వాత భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, శ్రీమంతుడు సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా సర్కారీ వారి పాట లో చేస్తున్నాడు. కీర్తి సురేష్ మహేష్ కి జోడిగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం గోవా లో షూటింగ్ జరుపుకుంటోంది.

సర్కారీ వారి పాట సినిమా నుంచి మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించి , ఈ సినిమాను 2022 లో సంక్రాంతికి విడుదల కానుంది.

ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో మరొక మూవీ చేయబోతున్నాడు. అంతే కాకుండా రాజమౌళితో కూడా మరొక మూవీ చేయాలనుకుంటున్నాడు.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సోదరి మంజుల తో సినిమా తీయబోతున్నాడు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేరే సినిమా తీయబోతున్నారు. మంజుల కొంతమంది దర్శకులని పిలిపించి కథను వింటోంది. అంతే కాకుండా రెండు రోజుల క్రితం ఒక దర్శకుడు చెప్పిన కథను ఓకే చేసిందని పలువురు నోట వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించనున్నారు..

అది పూర్తి అయిన తరువాత బయట పెడతారట. గతంలో తన సోదరుడుతో తీసిన మూవీ నానీ..ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో , మళ్లీ వేరే సినిమాతో మంచి హిట్ కొట్టిన సినిమా పోకిరి . ఇది అతి పెద్ద హిట్ ను సంపాదించి పెట్టింది. ఈసారి భారీ అంచనాలతో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తన కెరీర్ కి మంచి హిట్ ఇచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మరి ఇది నిజమే అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు.