ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ 30వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ మూవీలో ఎన్టీఆర్కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని తీసుకోవాలని కొరటాల భావించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కియారాను సంప్రదించగా.. ఆమె నో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం చరణ్-శంకర్ మూవీనే అని ప్రచారం జరుగుతోంది. శంకర్ దర్శకత్వంలో చెర్రీ 15వ చిత్రం తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి కూడా కియారాకు ఆఫర్ వచ్చింది.
అయితే బాలీవుడ్ ప్రాజెక్ట్స్తో బిజీ ఉండడం వల్ల.. అటు ఎన్టీఆర్, ఇటు చరణ్.. ఇద్దరిలో ఒకరి సినిమానే ఎంచుకోవాల్సిన పరిస్థితి కియారాకు ఏర్పడింది. ఈ క్రమంలోనే కియారా ఎన్టీఆర్కు నో చెప్పి.. చరణ్ మూవీని సెలెక్ట్ చేసుకుందట. ఎందుకంటే, చరణ్ మూవీని డైరెక్ట్ చేసేది ఇండియన్ టాప్ డైరెక్టర్స్లో ఒకరైన శంకర్. ఆయనతో వర్క్ చేయాలని హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఆశపడుతుంటారు. అందుకే కియారా చరణ్ మూవీని ఎంచుకుందట. కాగా, శంకర్, చరణ్ మూవీలో కియారా ఎంపిక అయినట్టు ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.