కోలీవుడ్ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. కేజీఎఫ్ర్1 కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా.. సంజయ్ దత్ విలన్గా కనిపించనున్నారు.
అయితే ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కేజీఎఫ్ 2కు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కూడా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కేజీఎఫ్2 నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే కళ్లుచెదిరే మొత్తం ఇస్తామంటూ ఆఫర్ చేసిందట.
కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఆ ఓటీటీ ఆఫర్ను రిజెక్ట్ చేసిందట. యష్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని.. కష్టమైనా, ఎన్ని రోజులు లేట్ అయినా థియేటర్లోనే సినిమాను విడుదల చేయాలని, ఈ విషయంలో అసలు తగ్గేదే లే అని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇక యష్ కూడా థియేటర్లోనే కేజీఎఫ్ 2 వస్తుందని ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. కాగా, ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు.