మమ్ముట్టి కుమారుడు, ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మలయాళ హీరోనే అయినప్పటికీ.. పాన్ ఇండియా స్టాయిలో గుర్తింపు తెచ్చికున్నాడీయన. ఇక మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న దుల్కర్.. తాజాగా ఓ కొత్త కారు కొనుగోలు చేశారు.
మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ నుంచి ఏఎమ్జి జి63 ఎస్యూవీ కారుని కొనుగోలు చేసాడు. ఈ కారును ఆలివ్ గ్రీన్ షేడ్తో పాటు బ్లూ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ అపోల్స్ట్రేతో కూడిన క్యాబిన్తో డిజైన్ చేశారు. ఇక చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ధర అక్షరాల రూ. 2.45 కోట్లు.
కాగా, దుల్కర్ సల్మాన్ ఎప్పటికప్పుడు మార్కెట్లోని లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఇప్పటికే ఈయన దగ్గర పోర్షే పనామెరా, టయోటా ల్యాండ్ క్రూయిజర్, ఆడి ఏ7 స్పోర్ట్ బ్యాక్, మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యు123, మెర్సిడెస్ బెంజ్ ఎస్- క్లాస్ వంటి కార్లతో పాటు ఖరీదైన బైకులు కూడా ఉన్నాయి.