ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. థమన్ ఈ మూవీని సంగీతం అందిస్తున్నారు.
అయితే నేటి నుంచి ఈ మూవీ షూటింగ్ షురూ అయింది. షూటింగ్ లోకెషన్లో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ రాజన్, స్టంట్ మాస్టర్ సిల్వతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ తల్లిదండ్రుల దీవెనతో సినిమా స్టార్ట్ అయ్యిందని డైరెక్టర్ మోహన్ రాజా తెలిపారు.
దాంతో మోహన్ రాజా ట్వీట్ కాస్త వైరల్గా మారింది. కాగా, కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్విఆర్ ఫిలిమ్స్ బ్యానర్లపై రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ని నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలనే ప్లాన్తో టీమ్ ఉన్నట్లుగా తెలిసింది. అలాగే ఈ చిత్రానికి గాడ్ఫాదర్, రారాజు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
https://twitter.com/jayam_mohanraja/status/1426002935658336259?s=20