పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో హిట్ అయిన పింక్కు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది. వేణు శ్రీరామ్ ఈ రీమేక్ కు దర్వకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి హిట్గా నిలిచింది.
అయితే ఈ చిత్రంలో పవన్-శ్రుతి హాసన్ ల ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులకు మెప్పించడంలో ఘోరంగా విఫలమైంది. నిజానికి పింక్లో హీరోయిన్ పాత్రే ఉండదు. వకీల్ సాబ్లో మాత్రం కావాలనే శ్రుతి హాసన్ క్యారెక్టర్ను యాడ్ చేశారు. కానీ, చివరకు ఆ ఎపిసోడ్ సినిమాకు ప్లస్ కాకపోగా.. మైనస్గా మిగిలింది. దాంతో అనవసరంగా హీరోయిన్ పాత్రను యాడ్ చేశామే అని బాధపడటం మేకర్స్ వంతైంది.
అయితే ఇప్పుడు పవన్ చేసిన తప్పునే.. చిరంజీవి కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆచర్య చేస్తున్న చిరు.. అనంతరం మోహన్ రాజా డైరెక్షన్లో మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ రీమేక్ చేస్తున్నాడు. అయితే లూసిఫర్లోనూ హీరోయిన్ రోల్ ఉండదు. కానీ, చిరు నటిస్తున్న రీమేక్లో మాత్రం హీరోయిన్ పాత్రను పెడుతున్నారు. మరి వకీల్ సాబ్లో పవన్కు కలిసిరాని హీరోయిన్ ఎపిసోడ్.. ఇప్పుడు చిరుకు లూసిఫర్ రీమేక్లో కలిసొస్తుందా..? లేదా..? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.