బాలయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటసింహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈయన బాలనటుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి , తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు బాలయ్య.. ఇకపోతే ఇటీవల సినీ ఇండస్ట్రీ పెద్దలు బాలయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆయనే స్వయంగా వాపోతున్నారు.. అంతేకాదు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎలాంటి సమావేశాలు జరిగినా కూడా , తనను పిలవకుండా, వారికి వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా పలు సందర్భాలలో బాలకృష్ణ నిరాశను వ్యక్తం చేయడం మనం గమనించే ఉంటాం..

ఒకటా, రెండా ఇలా ఎన్నో సమావేశాలకు బాలకృష్ణను పిలవడం మానేశారు మన సినీ ఇండస్ట్రీ పెద్దలు.. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులతో ఇటీవల సినీ ఇండస్ట్రీ పెద్దలు సమావేశమైనప్పుడు కానీ, చిరంజీవి ఇంట్లో అప్పుడప్పుడు పెట్టుకునే మీటింగ్ లకు కానీ ఆయనను పిలవలేదని, ఆయన అసహనానికి గురి అవుతున్నారు. అంతే కాదు ఇప్పుడు మరోసారి కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కొంత తగ్గుముఖం పట్టడంతో, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ పెద్దలకు పిలుపు వచ్చింది.

థియేటర్లు మళ్లీ ఓపెన్ అయిన విషయం కానీ, టికెట్ రేట్లు తగ్గించిన విషయం కానీ, ఇలా పలు సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై చర్చించడానికి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సినీ ఇండస్ట్రీ పెద్దలను మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో మీటింగ్ కి హాజరు కావాలని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అనగా సోమవారం మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన టాలీవుడ్ పెద్దలంతా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్ లో టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, అక్కినేని నాగార్జున, సోనాలి నారంగ్ ,నారాయణ దాస్ నారంగ్, ఆర్.నారాయణమూర్తి, సుప్రియ, వి.వి.వినాయక్ ఇలా సుమారుగా ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇందులో బాలకృష్ణ కనిపించకపోవడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈసారి కూడా ఎప్పటిలాగే బాలకృష్ణను సినీ పెద్దలు మర్చిపోయారా..? లేక పిలవడం మానేశారా..? లేక పిలిచినా బాలకృష్ణ హాజరు కాలేదా ..? అనే విషయంపై ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.. కానీ ఈ విషయంపై బాలకృష్ణ స్పందించే వరకు మనం వేచి చూడాల్సిందే.