అనంత శ్రీరామ్‌పై ఫిర్యాదు… ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రిలో అనంత్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తన మధురమైన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇది ఇలా ఉందా ఇటీవల అనంత్ శ్రీరామ్ రాసిన ఓపాట కారణంగా ఆయనపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇందుకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంత్ శ్రీరామ్, హీరో నాగశౌర్య కలిసి వరుడు కావలెను అనే సినిమా కోసం దిగు దిగు దిగు నాగ అనే పాటను రాసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఈ పాట యూట్యూబ్‌లో విడుదల అయినప్పటి నుండి ప్రేక్షకుల ద్వారా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. కానీ అనంత్ శ్రీరామ్ రాసిన పాట దేవుడిని కించపరిచేలా ఉందని ప్రముఖ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆమె నాగశౌర్య హీరోగా నటిస్తోన్న వరుడు కావలెను సినిమాలోని ఒక పాటలో నాగదేవతను కించ పరిచేలాగా ఉందని ఆరోపణలు చేశారు. ఈ తరుణంలో ఆమె నెల్లూరులో పోలీసులను ఆశ్రయించి అనంత శ్రీరామ్ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, అనంత శ్రీరామ్‌తో పాటు ఆ చిత్రా యూనిట్‌పై తగిన చర్యలు తీసుకోవాలని చిల్లకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.