యూనిట్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పుష్పరాజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బన్నీ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయ్యి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో బన్నీ పాత్రను చాలా ఊరమాస్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు సుకుమార్. ఇక ఈ సినిమా నుండి ఇటీవల కొన్ని సీన్స్ లీకవ్వడంతో చిత్ర యూనిట్ హైరానా చెందుతోంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు పోలీసులను ఆశ్రయించి ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారు చిత్ర యూనిట్. అయితే సినిమా యూనిట్‌కు హీరో అల్లు అర్జున్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఎవరూ ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని, అలాగే ఎడిటింగ్ రూమ్‌లో కూడా నిఘా ఉండాలని ఆయన చిత్ర యూనిట్‌కు సూచించారట. పుష్ప చిత్రం తన కెరీర్‌లో చాలా స్పెషల్ కాబట్టే ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన చిత్ర యూనిట్‌కు ఆర్డర్ వేశారట.

ఏదేమైనా వరుసగా స్టార్ హీరో సినిమాల నుండి లీకులు బయటకు వస్తుండటంతో బన్నీ తన సినిమాకు సంబంధించిన వరకు చిత్ర యూనిట్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి బన్నీ వార్నింగ్‌తో చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.