ఆనంది గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగమ్మాయే అయినప్పటికీ మొదట కోలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ఆనంది..తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన `జాంబీ రెడ్డి` సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత సుధీర్ బాబు సరసన `శ్రీదేవి సోడా సెంటర్` లో నటించింది.
గత వారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ మూవీతో ఆనంది పెర్ఫార్మన్స్ కు అభిమానులే కాదు నెటిజన్లు, సినీ తారలు సైతం ఫిదా అవుతూ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా.. సినిమా ప్రమోషన్స్ లో ఆనంది ఎక్కడా కనిపించలేదు. ఇకపై జరిగే ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా ఆమె కనిపించదట. ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటి నుండి ఆనంది అసలు చిత్రబృందానికి టచ్ లేదట.
ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. ఆనంది రెస్పాండ్ అవ్వలేదట. దాంతో మేకర్స్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి అసలు విషయం ఏంటా ఆరా తీయగా.. తాను గర్భవతిని అని ఆనంది తెలిపిందట. త్వరలోనే తల్లి కాబోతున్న ఆనందికి ప్రస్తుతం ఆరో నెల అని తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది జనవరి 7వ తేదీన వరంగల్ లో ఆనంది తమిళ కో డైరెక్టర్ సోక్రటీస్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె గర్భవతి. అందుకే శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ప్రమోషన్స్కు ఆనంది దూరంగా ఉందట.