లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ భామ.. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళం మరియు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా తెరకెక్కుతున్న `మిషన్ మజ్ను` సినిమాలో ఛాన్స్ అందుకుంది రష్మిక.
ఇదే ఆమెకు తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాకముందే.. రష్మిక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్తో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుడ్బై. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి వికాస్ దర్శకుడు. అయితే అమితాబ్తో కలిసి పనిచేసిన అనుభవాలను అభిమానులతో పంచుకుంది రష్మిక.
అమితాబ్తో కలిసి నటించడాన్ని జీవితంలో మరిచిపోలేనని తెలిపిన ఈ కన్నడ బ్యూటీ..బిగ్ బి చాలా కూల్గా సింపుల్ గా నటించేస్తారని.. ఆయనతో నటించేటప్పుడు పాత్రలో లీనమైపోవడంతో పెద్దగా ఆందోళన పడలేదని చెప్పుకొచ్చింది. అలాగే ఆయనతో కలిసి నటించడం పెద్ద కష్టమే కాదు అని తెలిపింది.