అతని వల్లే హీరోయిన్ అయిన లేడీ అమితాబ్..

టాలీవుడ్ సినీ పరిశ్రమలు లేడి అమితాబ్ గా గుర్తింపు పొందిన ఏకైక హీరోయిన్ విజయశాంతి. ఈమె ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ, కర్తవ్యం సినిమా ఈమెకు బాగా పేరు తీసుకు వచ్చింది. అంతే కాదు ఈ సినిమాతో ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఇక విజయ శాంతి అప్పట్లో నే స్టార్ హీరోల అందరితో కలసి నటించింది. ఇక ఇటు సినిమాలలోను, అటు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. అయితే ఈమె హీరోయిన్ కావడానికి ఒక వ్యక్తి కారణమట. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి అందరూ రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో విజయశాంతి కూడా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమా లో నటించి, మంచి మార్కులు సంపాదించింది.ఇక అంతే కాకుండా మహేష్ బాబు.. తన చిన్న వయసులో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయ శాంతి తో ఒక సినిమాలో కలసి నటించాడు.

ఇక అసలు విషయానికి వస్తే.. నేటి భారతం సినిమా తో టీ కృష్ణ గారు దర్శకత్వంలో విజయశాంతి నటించింది. ఇక ఈమె తన నటన తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఆ సినిమాకి కేవలం విజయశాంతి మాత్రమే సూటవుతుందని ఆలోచనతోనే ఆమెను హీరోయిన్ గా ఈ సినిమాలో నియమించుకున్నాడు టీ.కృష్ణ.

ఇక ఈ విజయశాంతిని టీ. కృష్ణ ఎప్పుడు శాంతమ్మ అని పిలిచేవారట. విజయశాంతి తనను అన్నా అని పిలుస్తూ ఉండేది. అలా వారిద్దరి కలయికలో ఎన్నో మంచి సినిమాలను తీయడం జరిగింది. ఒక విజయశాంతి తనని ఒక గురువుగా భావించి, తనకి తెలియని విషయాలను, టీ.కృష్ణ ను అడిగి తెలుసుకునేదట.

ఇక టీ కృష్ణ తన సినిమాలలో ఎక్కువగా విజయశాంతినే ఎంచుకునేవారట. అందుచేతనే తను “ప్రతిఘటన” సినిమాకి హీరోయిన్ గా విజయశాంతిని తీయాలని తన డేట్స్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేశాడట టీ.కృష్ణ . అందుచేతనే ఆమె నటి అవ్వడానికి గల కారణం ఎవరంటే టీ కృష్ణ అని చెప్తూ వుంటుంది విజయశాంతి.