బాల‌య్య‌, చిరుల‌కు నో అన్న‌ ఆ భామ..మ‌హేష్‌కు ఓకే చెప్పిందా?!

చెన్నైచంద్రం త్రిష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ‌.. చాలా కాలం నుంచి తెలుగు సినిమాల‌కు దూరంగా ఉంటోంది. ఇక చిరంజీవి ఆచార్య‌లో మొద‌ట త్రిష‌నే ఎంపిక చేయ‌గా.. ఆమె ప‌లు కార‌ణాల వ‌ల్ల ప‌క్క‌కు త‌ప్పుకుంది. అలాగే ఇటీవ‌ల బాల‌య్య‌, గోపీచంద్ మాలినేని సినిమా కోసం త్రిష్‌ను సంప్ర‌దించ‌గా.. నో చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

Mahesh Babu to reunite with Trivikram Srinivas for a film? - Movies News

అయితే బాల‌య్య‌, చిరుల‌కు నో చెప్పిన ఈ భామ‌.. ఇప్పుడు మ‌హేష్ సినిమాలో న‌టించ‌బోతోంద‌నే వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి.. మ‌హేష్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది.

Trisha (actress) - Wikipedia

అయితే ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ కోసం త్రివిక్ర‌మ్ త్రిష్‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది. కాగా. మహేష్ హీరోగా తెర‌కెక్కిన అతడు సినిమాలో త్రిషనే హీరోయిన్. అలాగే సైనికుడు చిత్రంలోనూ మ‌హేష్ స‌ర‌స‌న త్రిష‌నే న‌టించింది. ఇక తాజా వార్తలు నిజ‌మైతే..ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది.