తాప్సీ పన్ను.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ.. కొన్నాళ్లకే బాలీవుడ్కు మకాం మార్చేసింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది.
అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకూ కేరాఫ్ అడ్రస్గా మారిన తాప్సీ.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. నిర్మాతగా మారింది. అవుట్సైడర్ ఫిలింస్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది.
సూర్మా, పీకు వంటి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రంజల్ ఖాందియాతో కలిసి తన సంస్థ నుంచి సినిమాలు తీయనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తాప్సీ ప్రకటించింది. అలాగే తప్పకుండా మంచి కంటెంట్తో ముందుకు వస్తానంటూ తెలిపింది.