టాలీవుడ్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాక రేపుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్లో జరగాల్సిన ఎన్నికలపై ఇప్పటినుంచి సినీ ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది. ఈ నేథప్యంలోనే ఒక్కొక్కరిగా అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు.
ప్రస్తుతం మా ఎన్నికల రేసులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ మరియు సీవీఎల్ నరసింహ రావు ఉండగా.. ఇప్పుడు నటుడు సోనూసూద్ పేరు తెరపైకి వచ్చింది. కరోనా వచ్చినప్పటి నుంచి ఎందరికో తన వంతు సాయం చేస్తూ..రియాల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ను బరిలోకి దింపాలను పలువురు సినీ ప్రముఖులు తెర వెనక పావులు కదుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నారు.
ఇటీవల సోనుసూద్ మంత్రి కేటీఆర్ను కలవటంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. మరి నిజంగానే మా ఎన్నికల బరిలో సోనూసూద్ దిగితే.. మిగిలిన అభ్యర్థులందరూ గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే అని అంటున్నారు.