టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్.. తన తదుపరి చిత్రాన్ని రైటర్ & డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో నితిన్కు జోడీగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డేను తీసుకున్నారట.
ఇటీవలె పూజాను కలిసి కథ చెప్పగా.. అది ఆమెకు బాగా నచ్చిందట. అలాగే భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేయడంతో.. నితిన్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే.