రీ షూట్‌కు వెళ్తున్న ప‌వ‌న్ మూవీ..కార‌ణం అదేన‌ట‌?!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒక‌టి. ఈ చిత్రంలో మ‌రో హీరోగా రానా దగ్గుబాటి న‌టిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

South News | #PSPKRanaMovie: Pawan Kalyan and Rana Daggubati's Film, Ayyappanum  Koshiyum Telugu Remake, To Release in 2021! (Watch BTS Video) | ? LatestLY

అయితే క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మ‌ళ్లీ రీ షూట్‌కు వెళ్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూవీ నుంచి ఇటీవ‌ల సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల ప‌లు కారణాల వ‌ల్ల‌ తప్పుకున్నాడు. ఆయన వెళ్లిపోయిన తర్వాత షూట్ చేసిన‌ సన్నివేశాలు చూసిన పవన్.. సినిమా టెంపో సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశార‌ట‌.

Rana Daggubati joins hands with Pawan Kalyan for Telugu remake of Ayyappanum  Koshiyum - Hindustan Times

అందువ‌ల్ల‌నే, సినిమాను మ‌ళ్లీ మొద‌టి నుంచి రీ షూట్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రానికి మాటల మాంత్రీకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.