ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతోంది.
ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29, 2022న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఏకంగా 200 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారట. వివిధ భాషల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. ఆయా భాషల నుంచి ఆర్టిస్టులను ఎంపిక చేస్తున్నారట. అందువల్లనే బడ్జెట్ ఆ స్థాయికి చేరుకుందని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. కాగా, ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ కొరటాల మూవీని ప్రారంభించనున్నాడు.