ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. నయనతార, కీర్తిసురేష్‌, జగపతిబాబు, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుని దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేయనున్నారని ఎప్పటి నుంచో తమిళ సినీ వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

కానీ కరోనా కారణంగా మూవీ షూటింగ్ పలు మార్లు నిలిచిపోయింది. ఈ క్ర‌మంలోనే అనుకున్న సమయానికే విడుదల అవుతుందా? అవ్వదా? అని సందేహం అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే తాజాగా విడుద‌ల విష‌యంలో అన్నాత్తే మేక‌ర్స్ ర‌జ‌నీ ఫ్యాన్స్‌క‌కు గుడ్ న్యూస్ చెప్పారు.

 ముందుగా అనుకున్న డేట్‌కే 'అన్నాత్తే' విడుదల కానుంది. నవంబరు 4న దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. దీపావళికి అన్నాత్తే.. సిద్ధమా అని పోస్టర్ విడుదల చేసింది.

దీపావళి కానుకగా నవంబర్ 4నే సినిమాను విడుదల చేస్తున్నట్లు గురువారం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది. ఇక పండగకి రజనీ సినిమా వస్తే ఆయన అభిమానులకు పండగే పండగ.