సూప‌ర్ కాంబో..మ‌హేష్‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న లేడీ సూపర్ స్టార్!?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ చిత్రం చేయ‌నున్నాడు.

ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించ‌బోతోంద‌ట‌.

ఇటీవ‌లె న‌య‌న్‌ను సంప్ర‌దించి త్రివిక్ర‌మ్ క‌థ చెప్ప‌గా.. వెంట‌నే ఆమె ఓకే చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు న‌య‌న్‌, మ‌హేష్ జంట‌గా న‌టించింది లేదు. మ‌రి తాజా వార్త‌లు నిజ‌మైతే మహేష్ సరసన మొదటి సారి నయన్ స్క్రీన్ షేర్ చేసుకున్న‌ట్లు అవుతుంది. ఇక ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది.