విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. తమిళంలో హిట్ అయిన అసురన్కు ఇది రీమేక్. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్బాబు సంయుక్తంగా నిర్మించారు.
ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో జూలై 20న విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు ఎంత డీల్ కుదుర్చుకుంది అన్న దానిపై ఓ న్యూస్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. నారప్ప డైరెక్ట ఓటీటీ రిలీజ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.40 కోట్లకు కొనుగోలు చేసింది.
అంతేకాదు, శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా నిర్మాతలు అదనంగా కొంత డబ్బును పొందనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక వెంకీ మరో చిత్రం దృశ్యం 2 శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్స్టార్ మొత్తం రూ. 36 కోట్లకు సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి.