న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒకటి. హారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకుడు.
పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం.. ఇటీవలె మళ్లీ ప్రారంభం అయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలుపుతూ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్గా మారాయి. ఇక షూటింగ్ పూర్తి అయిందంటే.. త్వరలోనే మిగితా పనులు కూడా పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించడం ఖాయమంటున్నారు సినీ ప్రియులు. కాగా, నాని నటించిన టక్ జగదీష్ కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.