ఒకే ఫ్రేమ్‌లో శ‌ర్వా-సిద్ధార్థ్..అదిరిన `మ‌హాస‌ముద్రం` న్యూ పోస్ట‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `మ‌హాస‌ముద్రం`. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు న‌టిస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవ‌లె మ‌ళ్లీ స్టార్ట్ అయింది.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తూ.. శ‌ర్వా, సిద్ధార్థ్ ఒకే ఫ్రేమ్‌లో ఎంతో ఉత్సాహంగా క‌నిపిస్తున్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. కాగా, ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 19న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

Image