మ‌ళ్లీ ఆ భామ‌కే ఫిక్సైన చ‌ర‌ణ్‌..ఒక్క పోస్ట్‌తో శంక‌ర్ క్లారిటీ!

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ మూవీని బ‌డా ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఎప్ప‌టి నుంచో రకరకాల వార్త‌లు పుట్టుకొస్తూ ఉన్నాయి.

Image

అయితే తాజాగా ఈ విష‌యంపై శంక‌ర్ ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ భామ కియారా అద్వానీ న‌టించ‌బోతోంద‌ని ఓ పోస్ట‌ర్ రూపంలో అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక షూటింగ్ విష‌యానికి వ‌స్తే.. సెప్టెంబ‌ర్ నుంచి ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది.

Image

 

కాగా, కియారా గతంలో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో న‌టించింది. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక ఇప్పుడు మ‌రోసారి కియారాకే ఫిక్స్ అయిన చ‌ర‌ణ్‌.. హిట్ కొడ‌తాడో..లేదో..చూడాలి.