పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే, డైలాగులు అందిస్తున్నారు.
ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కరోనా సెకెండ్ వేవ్కు సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. కొంద షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ – రానా ఇద్దరి పాతలు ప్రధానమైనవే. రెండు పాత్రలకి సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీరి పాత్రల పేర్లను కలిపి టైటిల్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.