సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జె.శివకుమార్ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, మీనా, ఖుష్బు, కీర్తి సురేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సన్పిక్చర్స్ సంస్థ పై కళానిరిధి మారన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది.
ఇక అన్నాత్తే తర్వాత ‘కన్నుమ్ కన్నుమ్ కొళ్లైయడిత్తాల్(తెలుగులో కనులు కనులు దోచాయంటే) చిత్రదర్శకుడు దేసింగు పెరియసామితో రజనీ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్గా మారింది. ఈ చిత్రంలో రజనీకి జోడీగా బాలీవుడ్ స్టార్ మీరోయిన్ దీపికా పడుకోణె నటించబోతోందట.
మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, రజనీ..దీపికా జంటగా కోచ్చడయాన్ అనే చిత్రంలో కనిపించారు. అయితే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో యానిమేటెడ్ క్యారెక్టర్స్గా కనిపించారు. మరి ఈ సారి రెగ్యులర్ సినిమాలో జంటగా కనిపిస్తారా..లేదా..అన్నది త్వరలోనే తెలియనుంది.