బాలీవుడ్ భామ అనన్య పాండే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనన్య నానమ్మ, సీనియర్ నటుడు చుంకీ పాండే తల్లి స్నేహలతా పాండే కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. వయోభారం కారణంగా ముంబయిలోని బాంద్రాలో గల తమ నివాసంలోనే స్నేహలతా మృతి చెందారు.
తల్లి అంత్యక్రియలను చుంకీ పాండే దగ్గరుండి నిర్వహించారు. ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో పలువురు సినీ సెలబ్రెటీలు కూడా పాల్గొన్నారు. నానమ్మ మరణంతో అనన్య పాండే మరియు ఆమె చెల్లెలు రిసా పాండే కన్నీరుమున్నీరయ్యారు.
కాగా, అనన్య ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడీగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది.