ప్ర‌భాస్‌కు ఎప్పుడూ అదే ధ్యాస..బాలీవుడ్ భామ షాకింగ్ కామెంట్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. మ‌నిషి గంభీరంగా క‌నిపించినా.. మ‌న‌సు బంగారం అని డార్లింగ్ తో క‌లిసి ప‌ని చేసిన వారంద‌రూ చెబుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి భాగ్య‌శ్రీ కూడా ప్ర‌భాస్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నో ఏళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న భాగ్య‌శ్రీ‌.. మ‌ళ్లీ ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న‌ రాధేశ్యామ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది.

ఈ మూవీలో భాగ్య‌శ్రీ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అయితే తాజాగా భాగ్య‌శ్రీ‌.. ప్ర‌భాస్ గురించి మాట్లాడుతూ ఆయ‌న సెట్‌లో ఎంతో కూల్‌గా ఉంటార‌ని, అంద‌రితోనూ క‌లివిడిగా మాట్లాడ‌తార‌ని చెప్పుకొచ్చింది. అలాగే ప్ర‌భాస్‌కు ఫుడ్‌పైనే ధ్యాస ఉండేద‌ని..ఎప్పుడు చూడూ సెట్స్ లో ఫుడ్ ఐటమ్స్ గురించే చర్చించే వాడని.. గంటల తరబడి ఆయ‌న నోటి నుంచి ఫుడ్ గురించి తప్ప మరో విషయమే రాదని చెప్పుకొచ్చింది భాగ్య శ్రీ.

ఇక ఆయన తినడమే కాదు.. సెట్ లో అందరికీ తినిపించే వాడని.. ఇంటి నుంచి రుచిక‌ర‌మైన వంట‌ల‌న్నీ వండించి మరీ తీసుకొచ్చేవాడని భాగ్య శ్రీ చెప్పుకొచ్చింది. కాగా, ఇటీవ‌ల ఈ బ్యూటీకి ప్ర‌భాస్ పూత‌రేకులు పంపించిన సంగ‌తి తెలిసిందే.